19, అక్టోబర్ 2017, గురువారం

"ధన్వంతరి జయంతి" మరియు "జాతీయ ఆయుర్వేద దినోత్సవం" సందర్భంగా(17-10-2017)


"ధన్వంతరీ నమోస్తుతే!"
"వైద్యో నారాయణో హరిః"
క్షీరాబ్ధిం బ్రభవించి, మాన్యముగ లక్ష్మీమాత తోబుట్టువై .కారుణ్యం బెసలారు దైవతభిషగ్వర్యుండ!"ధన్వంతరీ!"
ఆ రోగార్త జనాళి కిచ్చితిగదా ఆరోగ్యభాగ్యంబులన్
ఊరార్పంగను వ్యాధిబాధితుల నాయుర్వేద శాస్త్రంబునే.
ఉదితం బయ్యెను వైద్యరంగమున నాయుర్వేద
సంగ్రామమే
ఎదురేలేని మహారుజారుల విదారింపంగ దివ్యౌషధీ
భిదురం బీయరె మానవాళి కిల గంభీరాటవీ సంపదల్
కదనోత్సాహులు, "వైద్య శ్రీహరులు" లోకం బేలు
"నారాయణుల్."
తరచి యోషధీ సాగర తత్త్వగుణము
"శుశ్రుతుండు" రచించెను 'శుశ్రుతంబు'
'చరక సంహిత'ను రచించె "చరకవెజ్జు"
ప్రజల పాలి కల 'హరి నారాయణు' లయి.
ధరణి ప్రాణాంతక వ్యాధితతుల బాపి
మరల నూపిరు లూదుచు 'మానవాళి
మనుగడకు' సేవ సల్పెడు మాన్యులైన
"వైద్యనారాయణహరుల" ప్రస్తుతింతు.
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి