13, జనవరి 2016, బుధవారం

"తెలుగు చంద్రులకు విన్నపాలు!"


18 కామెంట్‌లు:

  1. భాషతో ప్రమేయం లేకుండా ఏ రాష్ట్రంలో ఉండే వారిని ఆ రాష్ట్రమే చూసుకోవడం సత్సంప్రదాయం. తమిళనాడులో ఉండే వారి విషయంలో ఇతర రాష్ట్రాల రాజకీయవేత్తలు జోక్యం చేసుకోవడం తగదు. ఇదే జరిగితే రేప్పొద్దున ఆంధ్రలో తమిళుల కష్టాలు అంటూ జయమ్మ చీటికి మాటికి రాద్దాంతం చేసే ఆహ్వానం ఇచ్చినట్టు అవుతుంది.

    రిప్లయితొలగించండి
  2. ప్రభుత్వాలు తమ పరిపాలన పరిధిలో గల ప్రజలందరి సంక్షేమాన్నీ చూసుకుంటాయనేదీ, అవి అలా చూసుకోవాలనేదీ ఒక ఆదర్శవాదపు ఆశింపు. కానీ అవి అలా చెయ్యకుండా తమ ప్రజల్ని కొన్ని ప్రాతిపదికల మీద విభజించి వీరిలో కొందరికి మాత్రమే ఉద్దేశపూర్వకంగా న్యాయం చేస్తూ మిగతావారికి అన్యాయం చేయడానికి పూనుకోవడమే కాకుండా వారి అస్తిత్వానికే ఎసరుపెట్టాలని ప్రయత్నం చేయడం గతంలో చాలాసార్లు ౙరిగింది.ఇంకా ఇంకా ౙరుగుతూ ఉంది కూడా. నిరుడు తెలంగాణలో సమగ్రసర్వే పేరుతో ౙరపబోయి విరమించుకున్న రీజినల్ ప్రొఫైలింగు, హిట్లర్ హయాంలో జర్మనీలో జరిగిన అమానుషాలూ, బంగ్లాదేశ్ అవతరణకి ముందు పాక్ సైన్యం స్వదేశ పౌరుల్ని చేసిన ఊౘకోత, 1994 లో రువాండాలో 17 లక్షల మంది టూట్సీ రువాండన్లని ఆ దేశప్రభుత్వం హతమార్చిన వైనం,సద్దాం హయాంలో కుర్దు ప్రజల సంహారం, లెనిన్ హయాంలో కులక్ ల ఊౘకోత - ఈ ట్రాక్ రికార్డులేవీ కూడా ప్రభుత్వాల ఉద్దేశాలు సదా నిష్కళంకమేనని ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోతున్నాయి. వాటి ప్రవర్తన అలాంటి జాతిద్వేష పాలసీలతో కూడుకుని ఉన్నప్పుడు ఆ వ్యవహారంలో నేరుగా తల దూర్చడం అంతర్జాతీయ సమాజానికి, అందులోనూ తక్షణ పొరుగు రాజ్యాలకి తప్పనిసరి. Just to avert an impending humanitarian crisis. సాధారణంగా భౌతిక అణచివేతకి ముందు సాంస్కృతిక అణచివేత మొదలవుతుంది. No one knew this better than Tamils themselves. 1960 ప్రాంతాల్లో తమిళ భాషని అణచివేసే చర్యలకి పాల్పడ్డందువల్లనే కదా తమరు శ్రీలంక ప్రభుత్వం మీద ఉగ్రవాద సంస్థలు పెట్టుకు మరీ తిరగబడినది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాచస్పతి గారూ, ముందు ప్రస్తుత వివాదం మూలాలు చూద్దాం. నా సమాచారం తప్పయితే సరి చేయమనవి.

      తమిళనాడులో పూర్వం ఆంగ్లం & మాతృభాషలు బోదించే పద్దతి ఉండేది. పదేళ్ళ కిందట మాతృభాష స్థానంలో తమిళం తప్పని సరి చేసారు. భాషాపరమయిన అల్పసంఖ్యాకులు (ఉ. హిందీ/తెలుగు/కన్నడ పిల్లలు) తమతమ మాతృభాషను మూడో భాషగా నేర్చుకునే వెసులుబాటు ఉంది కానీ థర్డ్ లాంగువేజీ మార్కులు పరిగణనలోకి తీసుకోరు. అనేక న్యాయపోరాటాల తరువాత సదరు చట్టంలో లోపం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

      గడచిన పదేళ్ళలో ఈ పద్దతి అమలులో ఉన్నందున ఇప్పటికి పదవ తరగతిలో ఉన్న పిల్లలందరూ మొదటి నుండి తమిళం నేర్చుకున్న వారే (అయి ఉండాలి). అయితే కొన్ని బళ్ళు చట్టవ్యతిరేకంగా తమిళం నేర్పక పిల్లలకు అన్యాయం చేసాయి. ఈ పాపంలో సింహభాగం వారిదయితే తల్లితండ్రుల అజ్ఞానం కొంత తోడ్పడింది.

      ఈ వివాదానికి తెలుగు/కన్నడ/హిందీ వగైరా రంగు పులమడం సరి కాదు. అలాగే మిగిలిన 28 రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం అనర్ధానికి దారి తీస్తుంది. ప్రజలుగా మీరు నేను సంఘీభావం తెలపడం వరకు మాత్రమె (అదీ తెలుగు పేరుతొ రెచ్చ గొట్టకుండా) ఫరవాలేదు.

      వాదన కోసం కాస్సేపు ప్రస్తుత ఉదంతం తమిళ దురహంకారానికి & అల్ప సంఖ్యాకుల అణిచివేతకు చిహ్నం అనుకున్నా పై విషయాలు మారవు. తమిళనాట అల్పసంఖ్యాకులకు జరిగే అన్యాయానికి వారే స్వయంగా (పదీల నుండి సుమా) ప్రతిఘటించాల్సి ఉండుంది. అలాగే వోట్లు అడగడానికి వచ్చిన వారిని నిలదీయాల్సింది. ఇవేవీ జరిగిన దాఖలాలు లేవు.

      ఈ వివాదం ఊచకోత, అమానుషాలు, genocide, impending humanitarian crisis లాంటి స్థాయి కాదని గమనిస్తే బాగుంటుంది.

      కింది కారణాల వల్ల మీరు ఉదహరించిన శ్రీలంక తమిళుల పోలియా ఇక్కడ సరికాదు:

      1. శ్రీలంకలో తమిళులు దాదాపు ఐదో వంతు ఉండగా తమిళనాడులో అన్ని అల్పసంఖ్యాక భాషల వారు కలిప్తే 10% మాత్రమె
      2. శ్రీలంకలో అనేక ప్రాంతాలలో తమిళులు మెజారిటీగా ఉన్నారు. తమిళనాట ఈ పరిస్తితి ఎక్కడా ఉన్నట్టు లేదు.
      3. ఈలం లేదా తమిళానికి తగు గుర్తింపు కోసం చేసిన అన్ని పోరాటాలు చేసింది శ్రీలంక తమిళులే, భారత దేశం కాదు.

      తొలగించండి
  3. ఒకవేళ ఆంధ్రా-తెలంగాణాలో తమిళుల హక్కులకి భంగం కలుగుతోందని గనక తమిళనాడు ప్రభుత్వం భావిస్తే అందుకు వ్యతిరేకంగా గళమెత్తే హక్కు వారికీ తప్పకుండా ఉంటుంది. ఆ హక్కుని గతంలో వారు లెక్కలేనన్నిసార్లు వినియోగించుకున్నారు కూడా శ్రీలంక విషయంలో! ఇహపోతే వారిప్పుడు తెలుగుని అణచివేయాలని నిశ్చయించుకోవడాక్కారణం బహుశా - వారికి ఇంతకాలం వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న ఎఱ్ఱచందనపు స్మగ్లింగుకి ఆంధ్ర అడ్డుకట్ట వేయడమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకవేళ ఆంధ్రా-తెలంగాణాలో తమిళుల హక్కులకి భంగం కలుగుతోందని గనక తమిళనాడు ప్రభుత్వం భావిస్తే అందుకు వ్యతిరేకంగా గళమెత్తే హక్కు వారికీ తప్పకుండా ఉంటుంది: respectfully disagree, this will lead to chaos
      శ్రీలంక: పైన చూడండి
      ఎర్ర చందనం: చనిపోయిన వారు తమిళనాడు వాస్తవ్యులు, ఇక్కడ కష్టపడుతున్న వారు ఆంద్ర/తెలంగాణా/కర్నాటక వాస్తవ్యులు కారు

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. ఈ పైన జై గారి వాదన అనేక పొరపాటు దృక్కోణాల ఫలితం. వాటిల్లో ముఖ్యమైనదీ, ప్రప్రథమ ప్రస్తావ్యమైనదీ - ప్రాంతీయవాదం. ఈ దృక్కోణానికి బహుశా తెలంగాణ ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ ఉండొచ్చు. ఒక ప్రాంతపు పాలసీల్లో అన్యప్రాంతీయులు భవిష్యత్తులో జోక్యం చేసుకుంటారేమోనన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆధునిక కాలంలో రాజ్యాలకి పరిపాలనసౌలభ్యరూపంగా కాక తమ ప్రజల మీద మరో విధమైన సర్వసత్తాక అధికారాన్ని అంతర్జాతీయ సమాజం ఆమోదించదు. అన్ని రాజ్యాలూ విశ్వజనీనమైన మానవతావాద సూత్రాలకి కట్టుబడి తీరాల్సిందే. లేకపోతే ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షల్ని మనం ఖండించాల్సిన పనే ఉండేది కాదు కదా.

    ఒకప్పుడు కరుడుగట్టిన జాతీయవాదపు స్వర్ణయుగంలో అందరూ జైగారి వాదనే చేసేవారు. తత్ఫలితమే నేను పైన పేర్కొన్న మారణహోమాలు. "మా భూభాగం, మా ఇష్టం" అని వాదించిన ఫలితంగా స్థానిక జాతుల్ని రక్షించే మాట అలా ఉంచి మారణహోమాల్ని కనీసం ఖండించే నాథుడు కూడా లేకుండా పోయాడు ఆ రోజుల్లో! అదృష్టవశాత్తూ ఈ రోజుల్లో ఈ వాదాన్ని ఎవరూ అంగీకరించరు. స్థానిక జాతుల ఘర్షణల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిందే, వాటి ప్రభుత్వాలు ఎటు నిలబడుతున్నాయనే దాన్తో నిమిత్తం లేకుండా. ఎందుకంటే స్థానికంగా అణచివేయబడేవారికి స్థానికంగా మద్దతు లభించే పరిస్థితులు ఉండవు. వారు బైటికొచ్చి నోరెత్తడానిక్కూడా భయపడే పరిస్థితులు మాత్రమే ఉంటాయి.

    ఇహపోతే రెండో పొరపాటు దృక్కోణం - తమిళనాడు యొక్క భాషాపరమైన డెమోగ్రఫీకి సంబంధించినవి. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లాగా ఏకభాషా రాష్ట్రం కాదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే తప్ప తమిళనాడు చేస్తున్నది ఎంత అన్యాయమో అర్థం కాదు. 225 మంది సభ్యులు గల తమిళనాడు శాసనసభలో At any given point of time, 40 మందికి తగ్గకుండా తెలుగు ఎమ్మెల్యేలుంటారు. వారంతా అక్కడి తెలుగుప్రాంతాల ప్రజల చేత ఎన్నుకోబడ్డవారే. అయితే అక్కడి Two-party rule మూలాన ఏదో ఒక ద్రావిడ పార్టీలో చేరక తప్పని అనివార్య పరిస్థితుల్లో పడి ఈ అణచివేతకి వ్యతిరేకంగా నోరెత్తలేకపోతున్నారు.

    అందుచేత తమిళనాడులోని తెలుగువారిని తతిమ్మా భాషాపరమైన మైనారిటీలతో సమానం చేసి ఏ హక్కులూ లేనివారన్నట్లు మాట్లాడడం కూడా సరి కాదు. తమిళనాటి తెలుగువారు ఇటీవలే ఎక్కణ్ణుంచో తమిళనాటికి వలసవెళ్ళినవారు కారు. మద్రాసు తెలుగుల్ని మినహాయిస్తే మిగతా జిల్లాల తెలుగువారు, "మనకి తెలిసి కనీసం" గత 400 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నవారు. వారికి మాతృభాషాహక్కుల్ని ప్రసాదించడానికీ, ఇష్టం లేనప్పుడు లాగేసుకోవడానికీ అవి నేటి తమిళనాడు ప్రభుత్వం ప్రసాదించినవి కావు. సుప్రీం కోర్టు ప్రసాదించినవి అంతకంటే కావు. అవి గత 400 ఏళ్ళుగా రాజులూ, సుల్తానులూ, వలసపాలకులతో సహా అందరూ గౌరవిస్తూ వచ్చినవి. తమిళనాటి తెలుగువారు ఆ రాష్ట్రపు రెండో అతిపెద్ద భాషావర్గం. "వారి సంఖ్య 2 కోట్లకి పైగా ఉంటుం"దని ఈ జయమ్మగారే పదమూడేళ్ళ క్రితం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రకటించినట్లు నాకు జ్ఞాపకం. పదేళ్ళ క్రితపు నిబంధనలూ, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పులూ ఈ వాస్తవాల్ని మార్చజాలవు.

    తమిళనాడులో బలవంతపు తమిళ రుద్దుడుకి వ్యతిరేకంగా తెలుగు ప్రజల్లో రియాక్షన్ లేదనడం factually incorrect. అదే విధంగా అక్కడ తెలుగు మెజారిటీ జిల్లాలు లేవనడం కూడా సరికాదు. ఉదాహరణకి ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో తెలుగువారే ఎక్కువ. అక్కడ తమిళులు మైనారిటీ. అయినా తమిళనాడు ప్రభుత్వం బలవంతంగా అక్కడ తమిళ రుద్దుడు కార్యక్రమాన్ని అమలు జరుపుతోంది. అందుకు వ్యతిరేకంగా అక్కడ చాలా పెద్ద ఉద్యమమే జరుగుతోంది. అయితే తమిళ అనుకూల ప్రభుత్వమూ, అనుకూల మీడియా దాన్ని బైటికి రాకుండా అణచివేస్తున్నాయి. పైగా ఇంకో ఘోరం ఏంటంటే జనాభా లెక్కలప్పుడు అక్కడి ప్రజలు "తమ మాతృభాష తెలుగు" అని స్పష్టంగా చెప్పినా కూడా, ఆ ముక్కని రికార్డు చేయనివ్వకుండా తమిళనాడు ప్రభుత్వం ఎన్యూమరేటర్లని ముందే ట్రెయినప్ చేస్తోంది. రాజ్యపు టధికారం స్థానిక ప్రజల్ని అశక్తుల్ని చేసి వారికన్యాయం చేస్తున్నప్పుడు బైటి శక్తుల జోక్యం అవసరమవుతుందని నేనన్నది ఇలాంటి పరిస్థితి గురించే.

    శ్రీలంక తమిళుల పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికం కాదు. అది మెయిన్ లాండ్ తమిళుల క్రియాశీల సహకారంతోనే జరిగిందనేది ఏ సింహళీయుణ్ణి అడిగినా చెబుతాడు. ఆ పోరాటంలో భాగంగా భారతదేశపు మాజీ ప్రధానమంత్రి ఒకరిని శ్రీలంక తమిళులు హత్య చేయగలిగారంటే ఆ సహకారమూ, పాల్గోలూ ఎంత రేంజిలో ఉన్నాయో తెలిసిపోతూనే ఉంది. తమిళనాడు పాల్గోలు ఏదీ లేకపోతే సింహళీయులు తమిళనాడుని ఓ రాష్ట్రంగా ఎందుకు ద్వేషిస్తున్నారు? తమిళనాడు రాజకీయవేత్తల్ని ఎందుకు అసహ్యించుకుంటున్నారనే ప్రశ్నలకి సమాధానం కావాలి.

    రిప్లయితొలగించండి
  6. అయిదో పొరపాటు అభిప్రాయం - ఈ గొడవ టెక్నికల్ గా మూడో భాషగా ఉన్న సబ్జెక్టుకీ, తత్సంబంధిత మార్కులకీ సంబంధించినది అనుకోవడం. FYI ఇది మూడో భాష గొడవ ఎంతమాత్రమూ కాదు. మార్కుల గొడవ అసలే కాదు. ఇది ఓ తరతరాల ethnic population యొక్క మాతృభాషని అధికార బలంతో పాశవికంగా అణచివేయడానికి సంబంధించిన గొడవ. ఎందుకంటే తమిళనాడులో తెలుగు One of the subjects మాత్రమే కాదు. One of the media of instruction కూడా. తమిళనాడులో తెలుగు పాఠశాలలున్నాయి. తెలుగు కళాశాలలున్నాయి. వాటిల్లో తెలుగు లాంగ్వేజే కాదు, అన్ని సబ్జెక్టులకీ ప్రత్యేకంగా తెలుగు మీడియమ్ పాఠ్యపుస్తకాలు కూడా ఉన్నాయి. అవేవీ ఆంధ్ర-తెలంగాణల్లో ముద్రితమై ఇక్కణ్ణుంచి పంపించబడ్డవి కాదు. అవి తమిళనాటికి చెందిన తెలుగు రచయితలే వ్రాసినవి. తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా ముద్రించినవి. మీకవి అంతర్జాలంలో వెతికినా దొరుకుతాయి.

    ఇప్పుడు అడ్డగోలు నిబంధనలు తీసుకొచ్చి ఈ సెటప్ అంతా నాశనం చేయాలని తమిళనాడు భావిస్తోంది. బహుశా ఇందులో అనేక ఏడుపులు ఉన్నాయి. ఒకప్పుడు తమ రాష్ట్రాన్ని ఆక్రమించుకుని పరిపాలించిన తెలుగువారి సంస్కృతిని ఇకముందు మిగలనివ్వకూడదనే అక్కసు కూడా ఉండొచ్చు. ఇందులోని భావోద్వేగ అంశాల్ని విస్మరించి కేవలం టెక్నికల్ గా ఇంటలెక్చువల్ గా చర్చించినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. ఇహపోతే “ప్రజలుగా మనం సంఘీభావం తెలపడం మాత్రమే చెయ్యగల”మన్న పాయింటుతో మాత్రం ఏకీభవిస్తున్నాను.

    ఇప్పటికే చాలా ఎక్కువ వ్రాసినట్లున్నాను. ఈ టపా మీద ఇదే నా చిట్టచివరి వ్యాఖ్య. ఇక్కడ ఇంతకంటే ఎక్కువ వ్రాయడం సాధ్యం కాదు. అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  7. P.S. పదేళ్ళకి ముందు తమిళాన్ని నేర్చుకోకుండా శీతకన్ను వేసినది స్వయంగా కొందరు తమిళులే. తెలుగువారు కాదు. ఈ పని చేసినది ఆంధ్ర-తెలంగాణలో మాదిరే సంపన్నులైన తమిళులు. వారి మెడలు వంచడం కోసమే తమిళనాడు ప్రభుత్వం అప్పట్లో నిర్బంధ తమిళ నిబంధన తేవాల్సి వచ్చింది. అయితే దాన్ని ఇతర భాషాజాతుల హక్కుల్ని హరించడం కోసం ఉన్మాద స్థాయిలో బిగించాలని చూడడం దగ్గరే గొడవ మొదలైంది. మూడు భాషలున్నాయంటేనే వాటిల్లో తమిళం కూడా ఉందనే కదా అర్థం! ఇహ తమిళం నేర్చుకోవడం లేదని నెపం వేయడానికి అవకాశమేముంది?

    రిప్లయితొలగించండి
  8. రాజకీయవేత్తలు ఇతర రాష్ట్రాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే ఆదర్శం వినడానికి బావుంది. కానీ ఒక రాష్ట్రపు రాజకీయవేత్తలు ఇంకో రాష్ట్రపు వనర్లని దోచుకోవడం కోసం తమ రాష్ట్రప్రజల్ని పంపొచ్చునా?

    రిప్లయితొలగించండి
  9. ముందుగా దీంట్లో తెలంగాణా అంశం ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు. సందేహ నివృత్తి కొరకు నాదొక మనవి: తెలంగాణేతర మూలాల వారిపై ఎటువంటి గొడవలు చెలరేగినా అందరికంటే ముందు నేనే దానిపై వ్యతిరేకంగా వస్తాను. మీరూ నేనూ ఇక్కడే అంతర్జాలంలో ఉంటాం మున్ముందు చూద్దాం.

    రాష్ట్రాలు ప్రప్రధంగా భౌగోళిక పరిధులు. "నా భాష" మాట్లాడే వాళ్లకు ఎక్కడయినా పిసరంత కష్టం కలిగినా ఒంటికాలిపై లేస్తాను అంటే అసలు రాష్ట్రాలు ఎందుకు? నా రాష్ట్రంలో ఉండే ఇతర భాషీయుల గురించి పట్టించుకోను అన్న మనస్తత్వం నాణానికి మరో వైపు తప్ప వేరే కాదు.

    Excessive interest in the affairs of external co-linguists & trampling of local minorities are but both sides of the same coin i.e. linguistic arrogance. Hitler conquered Poland to "protect local Germans" and ended up unleashing the holocaust on non-Germans.

    ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు కానీ సెన్సస్ ఏమి చెబుతుంది? 2001లో తమిళనాడు జనాభా 6.2 కోట్లు ఉంటె అందులో తమిళులు 5.6 కోట్లు అనగా 89.5% అయితే తెలుగు వారు 35 లక్షలు అనగా 5.7%. నిజానికి తమిళనాడు కంటే కర్నాటకలోనే తెలుగు వారి సంఖ్య (37 లక్షలు) & శాతం (7.3%) ఎక్కువ.

    ఒకవేళ జనాభా లెక్కలు తప్పనీ భయపెట్టి తప్పుగా రాసుకున్నారన్నా అది ఏ మోతాదు? అంత దారుణ నిర్బంధం ఉంటే సదరు 40 మంది (40/235= 17%) యెమ్యెల్లెలు ఏమి చేస్తున్నారు? రెండు పెద్ద పార్టీలు కుమ్ముక్కయినా మిగిలన 8 పార్టీలు లేవా? ధర్మపురి క్రిష్ణగిరి జిల్లాలలో ఒకవేళ తెలుగు వారే మెజారిటీ అయితే తెలుగుకు తమిళంతో సమాన హోదా కావాలని అందుకు ఒప్పుకుంటేనే వోట్లు వేస్తామని ఎందుకు నిలదీయరు?

    చంద్రబాబు గారయినా ఇంకెవరయినా తమకు వోట్లు వేసిన (లేదా వేయగలిగిన) వారికి మాత్రమె జవాబుదారీలు. కాదూ కూడదు ఇతర రాష్ట్రాల విషయంలో "మా వాళ్ళ కొరకు" తల దూరుస్తామంటే అందులో వారికి స్వరాష్ట్రంలో రాజకీయ లబ్ది కోసమే తప్ప నిజంగా "బాదితుల" మీద సానుభూతి కాదు. గతంలో ఎన్నోసార్లు తమిళనాడు నాయకులు కర్నాటక తమిళుల కోసం అంటూ చిందులు వేసారు ఏమయింది? తమిళనాడులో సదరు నాయకులకు చప్పట్లు & కర్నాటక తమిళులకు ఇక్కట్లు మిగిలాయి.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. నిజమే,తమిళనాడు ప్రభుత్వం మీద ఈ రెండు రాష్త్రాల ముఖ్యమంత్రులూ పోట్లాడాలనటం మంచి పద్ధతి కాదు.ఆ ఒక్కటీ మినహాయిస్తే తమిళనాట తెలుగువారి పరిస్థితి గురించి వాచస్పతి గారి విశ్లేషణ బాగుంది.ప్రజలుగా మనం తప్పకుండా సంఘీభావం వ్యక్తం చెయ్యాలిసిందే!తమిళులు వేరే దేశంలోని తమ వాళ్లకి అంత బాహాటంగా ప్రోత్సాహం ఇవ్వగా లేంది మనం మన దేశంలోని మనవాళ్ళకి సహాయం అందిస్తే తప్పేంటి?చట్టాన్ని ధిక్కరించకుండా ఉన్నంతవరకూ మాట సాయం చేతి సాయం తప్పకుండా చెయ్యాలి.

    రిప్లయితొలగించండి

  13. Grab the festival eid al adha 2016 dates and eid al adha details for free of cost on our website. grandparents day 2016 will be celebrated in most of countries. It is also known as happy grandparents day 2016 . Apart from this labor day weekend 2016 is also coming next month. You can chek details of labor day 2016

    Get the unique Premier League Fixture 2016 and Premier League Fixture 2017 for free of cost. You can also search it by keywords like Premier League Table, Premier League Table 2016 and Premier League Table 2017 done. Share it by using Premier League Standings , Premier League Standings 2016 and Premier League Standings 2017 , Feel free to get the us open tennis 2016 info, latest Premier League Fixture info.

    We have also shared with you Premier League Fixtures as well as Premier League Table Apart from that you can find out the us open 2016 winners and Rio Olympics 2016 Schedule ,

    రిప్లయితొలగించండి